మత విద్వేషంపై పోరాటం, 5 లక్షల శాంతి ప్రతిజ్ఞల సేకరణ

గాంధీజీ రూపొందించిన సమైక్యతా ప్రతిజ్ఞపై జైభారత్ కార్యకర్తలు 5 లక్షలకు

పైగా సంతకాలను సేకరించడం ఒక మహొజ్వలమైన చరిత్ర. రంగుల

తేడాలను పట్టించుకోలేదు జైభారత్, ప్రజల మధ్య చిచ్చుపెట్టె ఏ

మతోన్మాదాన్నైనా ఎదిరించింది. మతసామరస్యాన్ని కాపాడేందుకు బలమైన
క్యాంపెయిన్ చేసింది.

మతకల్లోలాల్లో సర్వస్వం కోల్పోయిన భాదితుల్ని అనేక సందర్భాల్లో

ఓదార్చింది, నిజాయితీతో ఆదుకుంది. మతాలకతీతంగా సాటివారిని

ఆదుకున్న మానవతా మూర్తులను సత్కరించింది. విభిన్న మతాలకు

చెందిన మతగురువుల్ని, ఆచార్యులని ఆధ్యాత్మిక వేత్తల్ని ఒకే వేదికపైకి

తీసుకువచ్చి.. సమైక్యతా సందేశాన్ని వినిపించింది. 'మతోన్మాదానికి క్విట్

ఇండియా చెబుదాం' అనే నినాదంతో భారీ ఎత్తున్న మతసామరస్య

సమ్మేళనాలను నిర్వహించిది. ఊరేగింపులు తీసింది. సామరస్యం కోసం కృషి

చేసిన విశిష్ట వ్యక్తులకు గాంధిజీ పేరిట పురస్కారాలు ఇచ్చింది.బాంబు

పేలుళ్లను నిరసిస్తూ ప్రజల్ని కదిలించింది.విద్వేషాలను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ

మానవహారాన్ని నిర్మించిది. పండుగలను మతాలకతీతంగా జరుపుకునే...

సంప్రదాయాన్ని ఆచరణకు తెచ్చేందుకు అడుగులు వేసింది. గాంధిజీ బాటలో

నడచి...సమైక్యత కోసం 'ఖుదాయి ఖిద్మత్ గార్' ఉద్యమాన్ని నిర్మించి

మహానీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరుని తన కేంద్ర కార్యాలయానికి

పెట్టుకుంది జైభారత్. ముంబై నగరంలో ఇటీవల జరిపిన మతోన్మాద టెర్రరిస్ట్

దాడిని ఖండిస్తూ, అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ శాఖ

రాష్ట్రమంతటా.. 2008 డిసెంబర్ 2న కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించింది.

మహారాష్ట్ర శాఖ షోలాపూర్ తదితర ప్రాంతాల్లో సభలు జరిపింది..

గాంధీ జయంతి, షిరిడి సాయిబాబా వర్ధంతిని పురస్కరించుకొని.. ప్రతీ ఏటా

అక్టోబర్ నెలలో జిల్లాల్లోమండలాల్లో సైతం...ఒక మహోద్యమంగా పెద్ద

ఎత్తున మతసామరస్య సమ్మేళనాలను నిర్వహిస్తోంది. 'జైభారత్' . 1927 లో

కాకోరి వీరులు 'రామ్ ప్రసాద్ బిస్మిల్', అష్ఫాఖుల్లా ఖాన్' అమరులైన దినం

డిసెంబర్ 19 న ప్రతి ఏటా హిందూ - ముస్లిం ఐక్యత దినంగా జైభారత్ ఆంధ్ర

ప్రదేశ్, మహారాష్ట్ర శాఖలు పెద్దఎత్తున జరుపుతున్నాయి.

'విజయవిహారం' పైన దాడిని నిరసిస్తూ : మతవిద్వేషానికి, కులాహంకారానికి,

అవినీతి, అక్రమాలకూ సింహస్వప్నంగా నిలిచిన 'విజయవిహారం' పత్రిక పైన

ముష్కర పోలీస్ కుట్రలు విరుచుకు పాడినప్పుడు ప్రతి ఘటించింది 'జైభారత్'.

ఎడిటర్ అక్రమ అరెస్టును ప్రతిఘటిస్తూ కమీషనరేట్ ను ముట్టడించింది.

ఎడిటర్ ను విడిపించుకుంది. పోస్ట్ కార్డుల, పోస్టర్లద్వారా ప్రచారం చేసింది.

'విజయవిహారం' పైన కుట్రల్ని నిరసిస్తూ ప్రతిష్టాత్మక మైన రీతిలో...'రక్షణ భేరి '

వంటి భారీ సభని నిర్వహించింది. 'విజయవిహారం' జర్నలిస్టు, 'జైభారత్'

ప్రధాన కార్యదర్శి కిడ్నాప్ కి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున

ఉద్యమాన్ని నిర్వహించింది. బందీ ప్రదర్శినలని, కొవ్వొత్తుల

ఊరేగింపుల్నిరక్తదానల్ని, శవయాత్రల్ని నిర్వహించిది. ప్రజాసంఘాల,

మేధావుల, ప్రజాతంత్రవాదుల అబిప్రాయాన్ని కూడగట్టింది.

కామెంట్‌లు లేవు: